Moviesరాజ‌మౌళి - మ‌హేష్ - బాల‌య్య‌... ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్‌..!

రాజ‌మౌళి – మ‌హేష్ – బాల‌య్య‌… ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్‌..!

దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో త్రిబుల్ ఆర్ సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా కోస‌మే రాజ‌మౌళి మూడేళ్ల టైం తీసుకున్నాడు. రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంట‌నే రాజ‌మౌళి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సినిమా కోసం వ‌ర్క్ స్టార్ట్ చేసేస్తాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా ఫినిష్ చేసి.. ఆ వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా చేస్తాడు. ఈ రెండు పూర్త‌య్యేలోగా రాజ‌మౌళి మ‌హేష్ సినిమా క‌థ‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా కంప్లీట్ చేసి మ‌హేష్ కోసం రెడీగా ఉంటాడు.

మ‌హేష్ – రాజ‌మౌళి కాంబినేష‌న్లో సినిమా కోసం 15 ఏళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కేఎల్. నారాయ‌ణ సైతం ఎప్పుడో రాజ‌మౌళి, మ‌హేష్‌కు అడ్వాన్స్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మొత్తానికి రాజ‌మౌళి త్రిబుల్ ఆర్ త‌ర్వాత మ‌హేష్‌తోనే సినిమా చేస్తున్న‌ట్టు చెప్ప‌డంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆ జోష్ మోడ్‌లోకి అప్పుడే వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మ‌రో స‌ర్‌ఫ్రైజ్ న్యూస్ రాజ‌మౌళి ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌హేష్‌బాబుతో రాజ‌మౌళి తెర‌కెక్కించే సినిమా మ‌ల్టీస్టార‌ర్ అట‌. ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే.. ఈ సినిమాలో మ‌హేష్‌తో పాటు న‌టించే మ‌రో హీరో ఎవ‌రో కాదు.. న‌ట‌సింహం బాల‌కృష్ణ అని టాక్ ? ఇదే నిజం అయితే నంద‌మూరి, సూప‌ర్‌స్టార్ అభిమానులే కాకుండా టోట‌ల్ తెలుగు సినిమా అభిమానుల ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. గతంలో నంద‌మూరి, ఘట్ట‌మ‌నేని హీరోలు అయిన న‌ట‌ర‌త్న ఎన్టీఆర్‌, సూప‌ర్‌స్టార్ కృష్ణ క‌లిసి చాలా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. ఆ త‌ర్వాత త‌రంలో ఈ రెండు వంశాల‌కు చెందిన హీరోలు ఎవ్వ‌రూ క‌లిసి న‌టించ‌లేదు.

ఇప్పుడు నిజంగానే రాజ‌మౌళి ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసిన‌ట్టు.. వీరిద్ద‌రిని కూడా సెట్ చేసి మ‌ల్టీస్టార‌ర్ తీస్తే అది నిజంగా మ‌రోస్థాయి సినిమా అవుతుంద‌న‌డంలో సందేహం అక్క‌ర్లేదు. ఇప్ప‌టికే మ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి తండ్రి రెడీ చేసిన క‌థ‌.. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని.. యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువుగా ఉంటాయ‌ని చెప్పారు. ఇప్పుడు బాల‌య్య ఎంట్రీ ఇవ్వ‌డం.. అది కూడా సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు బాల‌య్య ఎంట్రీ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండేలా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ని అంటున్నారు.

ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోలో కాసేపు ఒకే స్క్రీన్ మీద బాల‌య్య – మ‌హేష్ క‌నిపిస్తేనే పెద్ద విజువ‌ల్ ఫీస్ట్ అయ్యింది. రేపు వెండితెర‌మీద కూడా వీరు ఒకే స్క్రీన్ మీద క‌నిపిస్తే అస‌లు టాలీవుడ్ సినీ అభిమానుల‌కు అంత‌కు మించిన ఆనందం మ‌రొక‌టి ఉండ‌దు. ఏదేమైనా ఈ కాంబినేష‌న్ సెట్ చేయాలంటే అది రాజ‌మౌళికే సాధ్యం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news