Moviesటాలీవుడ్‌లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీళ్లే...!

టాలీవుడ్‌లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీళ్లే…!

సినిమా వాళ్లు ప్రేమ‌లో ప‌డ‌డం.. పెళ్లి చేసుకుని విడిపోవ‌డం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం చాలా కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఇన్ని ద‌శాబ్దాల తెలుగు సినిమా చ‌రిత్ర‌లో కొంద‌రు హీరోలు ఒక‌టికి మించిన పెళ్లిళ్లు చేసుకున్నారు. నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో మొద‌లు పెడితే.. నేటి వ‌ప‌న్ క‌ళ్యాణ్ వ‌ర‌కు ఈ లిస్ట్ చాలా పెద్ద‌దే. మ‌రి ఆ హీరోలు ఎవ‌రో తెలుసుకుందాం.

సీనియ‌ర్ ఎన్టీఆర్ :
విశ్వ‌విఖ్యాత న‌టసౌర్వ‌భౌమ ఎన్టీఆర్ 20 ఏళ్ల వ‌య‌స్సులోనే త‌న మేన‌మామ కుమార్తె బ‌స‌వ‌తార‌కంను పెళ్లాడారు. అయితే 1985లో ఆమె గైనిక్ క్యాన్స‌ర్‌తో మృతిచెందారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లాడారు.

కృష్ణంరాజు:
రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజుకు కూడా రెండు పెళ్లిల్లు జ‌రిగాయి. కృష్ణంరాజు మొద‌ట‌ సీతా దేవిని వివాహం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మర‌ణించాక శ్యామ‌లాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. మొద‌టి భార్య‌కు ఓ కూతురు ఉండ‌గా.. ఆ త‌ర్వాత శ్యామ‌లాదేవితో కూడా కృష్ణంరాజు ఓ కుమార్తెను క‌న్నారు.

క‌మ‌ల్‌హాస‌న్‌:
విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఇద్దరిని పెళ్లాడటంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు. ముందు క‌మ‌ల్ వాణీగ‌ణ‌ప‌తిని పెళ్లాడారు. ఆ త‌ర్వాత అప్పుడు నార్త్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఉన్న సారిక‌ను పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత సారిక‌కు విడాకులు ఇచ్చి మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ గౌత‌మితో స‌హ‌జీవ‌నం చేశారు. ఇప్పుడు ఆమెకు కూడా దూర‌మ‌య్యారు. పూజాకుమార్‌తో క‌మ‌ల్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్టు టాక్ ?

నాగార్జున‌:
టాలీవుడ్ కింగ్ నాగార్జున మొద‌ట‌గా లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్ప‌టికే ఈ జంట‌కు నాగ‌చైత‌న్య జ‌న్మించాడు. ఆ త‌ర్వాత ల‌క్ష్మికి విడాకులు ఇచ్చి హీరోయిన్ అమ‌ల‌ను పెళ్లాడాడు. ఈ జంట‌కు అక్కినేని అఖిల్ జ‌న్మించాడు.

 

శ‌ర‌త్‌బాబు:
శ‌ర‌త్‌బాబు ముందుగా త‌న‌కంటే వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన ర‌మాప్ర‌భ‌ను పెళ్లాడారు. ఆ త‌ర్వాత ఆమెతో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయి… స్నేహ‌ల‌త‌ను పెళ్లాడారు. ఆ త‌ర్వాత‌ ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టు వివాహం చేసుకున్నారు.

ప్ర‌కాష్‌రాజ్‌:
ప్ర‌కాష్‌రాజ్ ముందుగా ల‌లిత‌కుమారిని పెళ్లాడారు. దివంగ‌త శ్రీహ‌రి, ప్ర‌కాష్‌రాజ్ తోడ‌ళ్లుల్లు. శ్రీహ‌రి భార్య డిస్కోశాంతి, ల‌లిత‌కుమారి అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరికి ముగ్గురు సంతానం త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ డ్యాన్స‌ర్ పోనీవ‌ర్మ‌ను పెళ్లాడారు.

పవన్ కళ్యాణ్ :
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొదటగా నందినిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణుదేశాయ్‌ను పెళ్లాడి ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిగాక ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి తీన్‌మార్ సినిమాలో త‌న ప‌క్క‌న చిన్న క్యారెక్ట‌ర్ చేసిన ర‌ష్యా అమ్మాయి అన్నా లెజ్నోవాను పెళ్లాడారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news