Moviesఅలా చేస్తే..అక్కడే తంతా.. డైరెక్టర్ నోట ఇలాంటి మాట..అస్సలు ఊహించలేదుగా..!!

అలా చేస్తే..అక్కడే తంతా.. డైరెక్టర్ నోట ఇలాంటి మాట..అస్సలు ఊహించలేదుగా..!!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమాలో నటించిన సంగ‌తి తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు ద‌శాబ్దాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ ప్రేమ‌కథ ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ సినిమాని బరీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రజంట్ దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది మొదటి వరసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

అసలకు అన్నీ బాగుండి ఉంటే ఈ సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ మాయదారి కరోనా మహమ్మారి దెబ్బకి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో..బయపడ్డ మేకర్స్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. అయితే ఈ సంక్రాంతికి ప్రభాస్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్న ఆయన అభిమానుల కు నిరాశనే మిగిల్చింది కరోనా. కాగా ఇటీవల మూవీ అప్ డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అటు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను, దర్శకుడు రాధా కృష్ణ ని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేయడం మనం చూశాం. ఇక రీసెంట్ గా కూడా అలాగే ప్రభాస్ అభిమాని డైరెక్టర్ ని బెదిరించాడు..దీంతొ ఆయన దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు.

తాజాగా రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులకు పలు ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ ఇస్తూ ఫన్నీగా నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమాని ఒకరు.. ‘హలో అన్నా.. నా మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా..’ అంటూ మెసేజ్ పెట్టాడు. వెంటనే తడుముకోకుండా రాధాకృష్ణ ..‘ఇంకోసారి ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా..’ అంటూ స్మైలీ ఎమోజీలను కూడా షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news