Gossipsస్టన్నింగ్ కాంబో: ఆ స్టార్ హీరోతో మహేశ్‌ బాబు మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్...

స్టన్నింగ్ కాంబో: ఆ స్టార్ హీరోతో మహేశ్‌ బాబు మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్ కు పూనకాలే…

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. భ‌ర‌త్ అనేనేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి వ‌రుస హిట్ల‌తో మ‌హేష్ దూసుకు పోతున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. మ‌హేష్ ప‌క్క‌న తొలిసారిగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా, ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రాజమౌళి సినిమా తరువాత మహేష్ ఓ బడా మల్టీ స్టారర్ మూవీ కి సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకె వెంఖటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు అనే సినిమా లో నటించారు మహేష్ బాబు. ఇక ఆ సినిమా ఎంతటి గన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఇక ఆ రేంజ్ లోనే గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ ఒక భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ మహేష్ బాబు తో పాటు నటీంచే మరో హీరో ఎవరో తెలిస్తే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రాం చరణ్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , మహేష్ -చరణ్ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి ఓ సినిమా తెరకెక్కించబోతున్నారంటూ తెలుస్తుంది. ఒక్కవేళ ఈ మాట నిజమైతే అభిమానులకు ఆ రోజు పెద్ద పండగనే చెప్పాలి. మరోవైపు మెగాస్టార్ కూడా ఈ సూపర్ స్టార్స్ ఇద్దరినీ కలిపి సినిమా చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news