Moviesఆ హీరోను దారుణంగా అవమానించిన నయనతార..నా పక్కన నటించే స్థాయి లేదంటూ..?

ఆ హీరోను దారుణంగా అవమానించిన నయనతార..నా పక్కన నటించే స్థాయి లేదంటూ..?

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారకి ఇప్పుడున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమెకు అదృష్టం బ్యాక్ పాకెట్ లో ఉన్నట్లు వరుస ఆఫర్ల తో ఇప్పుడు ఈ స్దాయిలో నిలుచుంది. లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇక వచ్చే ఏడాది ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లోన్ సెటిల్ అవుద్దాం అను కుంటుంది ఈ హాట్ బ్యూటీ.

ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారిన ఈ బ్యూటీ ఇప్పటికే సౌత్ స్టార్స్ అందరితోనూ నటించేసింది. నయనతార రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో తీసుకుంటుంది. అందుకే ఎక్కువగా రజనీకాంత్,బాలకృష్ణ, మెగాస్టార్ లాంటి వారితో నటిస్తోంది. ఇలా భారీ క్రేజ్ ఉన్న నయనతార తను నటించిన సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం రాదు. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో సినిమా అయిన సరే ఆమె అగ్రిమెంత్ ముందు సైన్ చేసేట్టప్పుడే ప్రమోషన్స్ చేయను అని తెగేసి చెప్పేస్తుందట. కానీ అమ్మడుకి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా దర్శక నిర్మాతాలు అందుకు ఓకే చెప్పుతున్నారట.

ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీ సినిమాలో కీలక పాత్ర పోషించడానికి రెడీ అయింది. ఇదివరకె చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి రీమేక్ చేస్తున్న లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో గాడ్ ఫాదర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయంతార చిరంజీవికి చెల్లెలుగా నటించబోతుంది.

ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో మంజువారియ‌ర్ పోషించిన పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. అయితే మంజువారియ‌ర్ భ‌ర్త‌గా బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టించాడు.ఇక వివేక్ ఒబెరాయ్ పాత్రలో తెలుగులో స‌త్య‌దేవ్ ను సెలక్ట్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో నయన్ కొంత నిరాశ చెందుతున్నత్లు తెలుస్తుంది.

తనకు జోడిగా పాపులర్ యాక్టర్ ని తీసుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు జోడీగా నటించేంత పాపులారిటీ.. స్థాయి సత్య దేవ్ కి లేదని నయనతార చిత్ర బృందానికి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సత్య దేవ్ ప్లేస్ ని వేరే వాళ్లతో రీప్లేస్ చేయమని డైరెక్టర్ ని అడిగిన్నత్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఎట్టి పరిస్థితిలోను సత్యదేవ్ నీ మార్చడం కుదరదు అని .. ఈ సినిమా తీద్దామని అనుకున్నప్పుడు చిరంజీవి తర్వాత అనుకున్న పాత్ర సత్యదేవ్‌దేనని దర్శకుడు మోహన్‌రాజా స్పష్టం చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ ఇండస్తృఈలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఇక దీని పై నెటిజన్స్ కూడా భిన్నంగా కౌంటర్ లు ఇస్తున్నారు. నయన్ డామినేషన్ మళ్లీ మొదలైందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news