Moviesరెండేళ్లు దూరంగా ఉన్న మహేష్ బాబు-నమ్రత.. ఎందుకో తెలుసా..?

రెండేళ్లు దూరంగా ఉన్న మహేష్ బాబు-నమ్రత.. ఎందుకో తెలుసా..?

మహేష్ బాబు-నమ్రత..టాలీవుడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్. టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఇక బాలీవుడ్ లో నమ్రత కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరుగా కొనసాగుతున్న టైంలోనే వీళ్ల పెళ్లి జరిగిపోయింది. వంశీ అనే సినిమా చేస్తున్నప్పుడు వీళ్లిద్దరు లవ్ లో పడ్డారు. ఆ విషయాని కొన్ని రోజులు దాచి..ప్రేమించుకుని..సీక్రేట్ గా పెళ్లి చేకుని..ఆ తరువాత ఇంట్లో వాళ్లను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చూడ చక్కనైన జంట అంటే మహేష్ నమ్రతనే చెప్పాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న మహేష్ అంటే అమ్మాయిలకు ఎనలేని ఇష్టం. ఆయనంటే అదేంటో తెలీయని క్రష్ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కుటుంబానికి మహేష్ బాబు ఇచ్చే ప్రాధాన్యత..మిగతా ఏ హీరో కూడా ఇవ్వరు ఏమో అనిపిస్తుంది. షూటింగ్ పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం గడుపుతారు మహేష్. సినిమా సినిమాకు మధ్య ఖాళీ ఏమాత్రం ఉన్న పూర్తి సమయాన్ని కుటుంబానికే ఇస్తూ ఉంటాడు.

ఇక భార్య భర్తలు అన్న తరువాత గొడవలు పడడం కామన్. అలా పడితేనే వాళ్ల మధ్య ఇంకా ప్రేమ పెరుగుతుంది అని అంటారు మన పెద్దవాళ్లు. గొడవలు సరదాగా ఉంటే మంచిది.. మరీ తెగే వరకు ఏ విషయాని లాగకూడదు. ఇక మహేష్ బాబు నమ్రతలు కూడా పెళ్లైన కొత్తల్లో గొడవలు పడేవారట. చాలా సార్లు సర్ధుకుపోయిన నమ్రత..ఒక్కసారి మాత్రం కోపం వచ్చి ముంబైకి వెళ్ళిపోయిందట. ఏకంగా మహేష్ బాబుకు రెండేళ్లు పాటు దూరంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసాయి. ఇక మహేష్ బాబు..భార్యను కూల్ చేసి..మళ్లీ హైదరబాద్ కి రప్పించుకున్నాడట. ఇప్పుడు ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్లకి సితార, గౌతం అనే పాప బాబు కూడా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news