Moviesమళ్ళీ మమ్మల్ని ఆ చీకటి జ్ఞాపకాల్లోకి లాగొద్దు..వెంకటేష్ ఎమోషనల్..!!

మళ్ళీ మమ్మల్ని ఆ చీకటి జ్ఞాపకాల్లోకి లాగొద్దు..వెంకటేష్ ఎమోషనల్..!!

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన దృశ్యం సీక్వెల్‌ను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయి మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. వెంకటేష్, మీనాల జోడీ థియేటర్స్‌లో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. వెంకటేశ్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీ పియ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.

ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా దృశ్యం-2 టీజర్ రిలీజ్‌ చేసిన మూవీ టీమ్ ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఇక ‘రాంబాబు కేసు ఏమైంది?’ అంటూ ప్రారంభమైన టీజర్ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది మూవీ టీజర్.

అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ టీజర్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న వెంకటేష్.. రాంబాబు కేసు ఏమైంద‌నే దానిపై ఆ రోజు క్లారిటీ వస్తుందని తెలిపారు. ఆసక్తి రేకెత్తిస్తున్న సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ టీజర్‌లో ”ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ లాగొద్దు” అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ హైలైట్ అయింది. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news