Moviesబిగ్‌బాస్‌ సంచలన నిర్ణయం..హోస్ట్‌గా రమ్య కృష్ణ.. అసలు ఏమైందంటే..?

బిగ్‌బాస్‌ సంచలన నిర్ణయం..హోస్ట్‌గా రమ్య కృష్ణ.. అసలు ఏమైందంటే..?

యస్..ప్రస్తుతం వినపడుతున్న సమాచారం బట్టి ఇదే నిజం అనిపిస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ రాబోతున్నారట. ఎందుకంటే.. లోకనాయకుడు కమల్‌హాసన్‌ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళంలో ఆయన హోస్ట్‌గా ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’ కు ఇపుడు తాత్కాలికంగా కొత్త హోస్ట్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కమల్‌హాసన్‌ స్థానంలో ఎవరిని పెదితే బాగుంటుందా అని మెనేజ్ మెంట్ చర్చించుకుని.. ఫైనల్ గా శివగామి రమ్యకృష్ణ ను పెట్టాలని డిసైడ్ అయ్యారట.

మొదట ఆయన ప్లేస్ లో కూతురు శ్రుతిహాసన్‌ ని హోస్ట్గా పంపుదాం అని అనుకున్నారట. కానీ ఆమె అందుకు నో చెప్పడంతో..లాస్ట్ కి రమ్యకృష్ణను కాంటాక్ట్ అయ్యి పరిస్ధితి వివరించ్గా ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం భారీ గా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసిందట. అందుకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఒకే చెప్పారట. దీంతో రానున్న ఎపిసోలకు వ్యాఖ్యాతగా రమ్య కృష్ణ రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా శ్రుతినే హోస్ట్‌గా వస్తుందని చాలామంది భావించారు కానీ టాలీవుడ్‌ ‘శివగామి’ రమ్యకృష్ణ తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వస్తుండడం తో అక్కడ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం’ బిగ్‌బాస్‌’ ప్రసారం అవుతున్న ఛానల్‌లో రమ్యకృష్ణ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇక ఇది వరకే రమ్య కృష్ణ తెలుగు బిగ్ బాస్ లో నాగార్జున కి బదులుగా ఓ వారం హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి తోడు కొత్తవారిని హోస్ట్‌గా ఎంపిక చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని, ఇది షో రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపే ఉందని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే అనుభవం ఉన్న రమ్యకృష్ణనే వారు సంప్రదించారని తెలుస్తోంది. మరి చూడాలి తమిళ ప్రేక్షకులు ఆమెను ఎలా రిసీవ్ చేసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news