Moviesఆ జర్నలిస్ట్ వల్లే "మా"లో ఇన్ని వివాదాలు ..మంచు విష్ణు సంచలన...

ఆ జర్నలిస్ట్ వల్లే “మా”లో ఇన్ని వివాదాలు ..మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!

అక్టోబర్ 10న జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకున్ని..విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. అయితే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత “మా” కి చాలా మంది సభ్యులు రాజీనామాలు చేసారు. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా.. నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్.. ఆ తరువాతా ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం రాజీనామా చేశారు.

ఇదిలావుండగా తాజాగా ఆయన నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అసలు నాకు ఇంతవరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి ఒక్కటి అంటే ఒక్కటి రాజినామ అందలేదు అని తెల్చేసారు. అయితే ఆ తరువాత సడెన్ గా ప్రెస్‌మీట్‌ పెట్టేసారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కార్యక్రమంలో నేను, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నామని చెప్పారు. అంతేకాదు తెలుగు వాళ్ళు మాత్రమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలని తాము ఎక్కడా ప్రకటించలేదని కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం చిరంజీవి-మోహన్ బాబు ఫోన్‌లో మాట్లాడుకున్నారని చెపుతూ జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్ట్ ఒక డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యారని.. ఆ జర్నలిస్ట్ వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాని విష్ణు కామెంట్ చేశారు. ఆయన మాటలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news