Moviesబాలయ్య లుక్స్ పై అభిమానుల రియాక్షన్.. ఏమన్నారో తెలుసా..?

బాలయ్య లుక్స్ పై అభిమానుల రియాక్షన్.. ఏమన్నారో తెలుసా..?

మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ మరోసారి రంగంలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ”సింహా, లెజెండ్” సినిమాతో భారీ హిట్స్ రాబట్టిన ఈ క్రేజీ కాంబో ఈ సారి ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో మాస్ కిక్కుతో పాటు రొమాంటిక్ ట్రీట్ ఉండేలా బోయపాటి ప్లాన్ చేసుకున్నారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ అప్‌డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాయి. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ ‘అడిగా అడిగా’ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. అందమైన ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ ‘అడిగా అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా.. అంటూ యుట్యూబ్ ను అద్దరగొట్టేస్తుంది.ఇక ఈ పాటను ఎస్పీ చరణ్ -ఎంఎల్ శృతి కలసి అద్భుతంగా పాడారు. ఇక ఈ పాట విన్న ఆయన అభిమానులు..ఇందులో బాలయ్య లుక్స్ అదుర్స్ అంటున్నారు. సినిమా బోమ్మ అదుర్స్ అంటూ సొషల్ మిడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. బాలయ్య చిత్రంలోని అఖండ నుంచి అందమైన మెలోడీ పాటను మీరు వినండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news