Moviesసాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యిందని మొట్టమొదట మెగా ఫ్యామిలీలో...

సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యిందని మొట్టమొదట మెగా ఫ్యామిలీలో ఏ హీరోకు ఫోన్ చేసారో తెలుసా..??

మెగా హీరో సాయి ధరమ్ తేజ్..గత రెండురోజుల నుండి మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఈ నెల 10వ తేదీన‌ రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తుండ‌గా సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్ర‌మాదానికి  గురైన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఆయనకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న వారు ఆయనని హుటాహుటిన మెదికోవర్ హాస్పిటల్ కి తరలించారు. ఇక అక్కడే ఆయనకు గోల్డెన్ హవర్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.

మొత్తానికి డేంజర్ పోజిషన్ నుంది బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ .. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు అని తెలుసుకున్న మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ,నిహారిక,ఉపాసన,సురేఖ ఆస్పత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించారు.

అయితే న‌టుడు సాయిధ‌రమ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై అపోలో ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ను సోమ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారుసాయితేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. ఐసీయూలోనే ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నాం. వెంటిలేట‌ర్ అవ‌స‌రం క్ర‌మంగా తగ్గుతోంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంలో మెగా ఫ్యామిలీ తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ తెలిసిందే. అసలు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే మెగా కుటుంబంలో మొదటగా అల్లు అర్జున్ కే ఈ విషయం తెలిసిందట. అప్పుడు ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారట.

ఎక్కడో షూటింగ్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కు ఈ ప్రమాదం గురించి ఎలా తెలిసిందా..?? అన్ముకుంటున్నారా.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారుగా.. అయితే ఆ ఆస్పత్రిలో అల్లు అర్జున్ సన్నిహితులు ఉండడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి ఫస్ట్ చెప్పారట..ఆ తరువాత ఈ విషయం మెల్లగా మీడియాకు లీకైందట.ఇక అలా అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యులకు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్ని తెలియజేశారట.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news