Gossipsఅక్కినేని వారసుడికి దిమ్మ తిరిగే షాక్ .. పెద్ద బొక్క పడ్డిందిగా.?

అక్కినేని వారసుడికి దిమ్మ తిరిగే షాక్ .. పెద్ద బొక్క పడ్డిందిగా.?

అక్కినేని వారసుడు అఖిల్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కలమే అయినా.. కానీ, ఈ అఖిల్ కి ఇంతవరకు ఒక్క హిట్టు కూడా పడకపోవడం గమనార్హం. ఎప్పుడు రొటీన్ కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని హిట్ కొట్టే నాగార్జునకు ఆయన కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ పైకి మరోసారి దండయాత్రకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా వస్తున్నాడు అఖిల్ అక్కినేని. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడెప్పుడో విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్తుకున్నారు మేకర్స్. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ అందుకోవాలి అని అఖిల్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సింది..కానీ మాయదారి కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేస్తూ మేకర్స్.. అక్టోబర్​ 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. కానీ తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయడం లేదనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాను విజయదశమికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో విడుదల తేదీని అక్టోబర్ 15న విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news