Gossipsతగ్గేదే లే.. ఆ హీరోయిన్ కోసం తెగించేసిన దిల్ రాజు..??

తగ్గేదే లే.. ఆ హీరోయిన్ కోసం తెగించేసిన దిల్ రాజు..??

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా వ‌చ్చిన‌ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కియారా.. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ చిత్రం త‌ర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కియారా న‌టించ‌లేదు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం సాధించకపోవడంతో తిరిగి బాలీవుడ్‌‌‌కు చెక్కేసింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస అవ‌కాశాల‌తో ఛాన్సులు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అక్కడ ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ అమ్మడికి అక్కడ వరుస అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌గా రాణిస్తోంది.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన మూవీ టీం ఆమెను వెల్‌కం అబోర్డ్‌ అంటూ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసందే.

అయితే ఈ అమ్మడు ఈ సినిమా కోసం భారి పారితోషం డిమాండ్ చేస్తందట. తెలుగులో మహేష్ బాబుతో ఓ సినిమా, రామ్ చరణ్‌తో మరో సినిమా చేసిన కియారా.. ఈ రెండు సినిమాలకు గాను ఒక్కోదానికి కోటి రూపాయల చొప్పున పారితోషికం తీసుకుందట. అయితే శంకర్- రామ్ చరణ్ సినిమా కోసం మాత్రం ఏకంగా 5 కోట్లు రూపాయలు డిమాండ్ చేస్తుందని టాక్. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..కియారా అంత రెమ్యునరేషన్ అడిగినప్పటికి ఈ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు వెనక్కితగ్గకుండా.. ఓకే చెప్పారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news