Moviesభార్య భర్తలు పక్కా ప్లాన్..వాట్ ఎన్ ఐడియా సర్ జీ..!!

భార్య భర్తలు పక్కా ప్లాన్..వాట్ ఎన్ ఐడియా సర్ జీ..!!

శరత్ కుమార్.. దక్షిణాది భాషల్లో నటించి మంచి పవర్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ చేయడానికి అన్ని పనులు జరిగిపోయాయి. ఎప్పటి నుండో ఓట్ట్లో వెబ్ సిరీస్ చేయాలనీ అనుకుంటున్నారట.. కానీ ఇన్ని రోజులు కరోనా కారణంగా కుదరలేదని.. ఇప్పుడు అందుకు శ్రీకారం చుడుతున్నాట్లు చెప్పారు .

నటుడు శరత్‌కుమార్‌ ఓటీటీ ఎంట్రీ షురూ అయింది. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో కథానాయకుడిగా నటించి సుప్రీం హీరోగా పేరు గాంచిన నటుడు శరత్‌కుమార్‌ తాజాగా ‘ఇరై’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ అవుతున్నారు.ఈ వెబ్ సిరీస్ కు “ఇరై” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ సీనియర్ హీరోయిన్ మరియు శరత్ కుమార్ సతీమణి రాధికా శరత్ కుమార్ స్వయంగా నిర్మించనున్నారు.

తన రాడాన్ సంస్థ ద్వారా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్లు అధికారిక సమాచారం.ఇంతకు ముందు తూంగావనం, కడారం, కొండాన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేస్‌ ఎం.సెల్వ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి ఓటిటి వేదికగా విడుదల చేయనున్నారు. అయితే ఏ ఓ టి టి లో విడుదల చేస్తారనే దానిపై సరైన సమాచారం లేదు. ఇటీవలే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సిరీస్‌ గురించి నిర్మాత రాధిక శరత్‌కుమార్‌ మాట్లాడారు. ఇరై వెబ్‌ సిరీస్‌ ద్వారా తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రంగం ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news