Moviesమాజీ ప్రియుడిపై హీరోయిన్ గ‌రంగ‌రం... ప‌రువు న‌ష్టం దావాకు అమ‌లాపాల్ రెడీ..!

మాజీ ప్రియుడిపై హీరోయిన్ గ‌రంగ‌రం… ప‌రువు న‌ష్టం దావాకు అమ‌లాపాల్ రెడీ..!

సౌత్ ఇండియా లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అమలాపాల్. వరుస హిట్లతో కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు ఏఎల్‌. విజయ్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రెండేళ్లకే వారి కాపురంలో కలతలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ వ‌రుస‌ పెట్టి సినిమాలు చేస్తున్నా మునుపటి అందుకోలేక పోతుంది. విజయ్ తో విడాకులు తర్వాత అమ‌ల‌ ముంబైకి చెందిన సింగర్ భ‌వీందర్ సింగ్ తో కొంత కాలం పాటు డేటింగ్ చేశాక అతడితో కూడా విడిపోయింది.

 

క‌రోనా లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరి పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో చాలామంది వీరికి వెళ్లిపోయిందని భావించారు. భ‌వీంద‌ర్‌ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అమలాపాల్ అత‌డిపై ఫైర్‌ అయింది. ఒక యాడ్ ఫిలిం కోసం షూట్‌ చేసిన ఫోటోలను భ‌వీందర్ కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ పరువు నష్టం దావా వేసేందుకు ఆమె చెన్నై హైకోర్టును ఆశ్రయించింది.

 

భ‌వీంద‌ర్ సింగ్ చేసిన చ‌ర్య‌తో త‌న‌కు ప‌రువు న‌ష్టం క‌లిగింద‌ని ఆమె ఆరోపించింది. ఈ కేసు వివ‌రాలు విన్న చెన్నై హైకోర్టు జ‌స్టిస్ కేసు వేసేందుకు అమ‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు.  మరి దీనిపై భ‌వింద‌ర్‌ ఎలాంటి వివరణ ఇస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news