Newsవాకింగ్ చేస్తుండగా.. మాటు వేసి వైసీపీ నేత మ‌ర్డ‌ర్‌

వాకింగ్ చేస్తుండగా.. మాటు వేసి వైసీపీ నేత మ‌ర్డ‌ర్‌

రాయ‌ల‌సీమ‌లో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ ప‌డ‌గ విప్పింది. కర్నూలు జిల్లాలో వైసీపీ నేత ఒక‌రు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. నంద్యాల‌కు చెందిన న్యాయ‌వాదిని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు చంపేశారు. వైఎస్సార్‌సీపీలో కీల‌క నేత‌గా ఉన్న న్యాయ‌వాది సుబ్బారాయుడు ఉద‌యం వాకింగ్‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. పోలీసులు చెప్పిన క‌థ‌నం ప్ర‌కారం సుబ్బారాయుడు ఉదయం వాకింగ్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సమీపంలోనే ఆయన కోసం మాటు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారాయుడు రాగానే కర్రలతో దాడిచేశారు.

 

ఈ దాడిలో బాగా దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో సుబ్బారాయుడు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మ‌ర్డ‌ర్ జ‌రిగిన ప్రాంతంలో క్లూస్ టీం ఆధారాలు సేక‌రించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఏవై ఉంటాయా ? అని ఆరా తీస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news