Newsప్రియురాలి కోసం ఇద్ద‌రు స్నేహితుల‌ గొడ‌వ‌... క్లైమాక్స్‌లో జ‌రిగింది ఇదే...!

ప్రియురాలి కోసం ఇద్ద‌రు స్నేహితుల‌ గొడ‌వ‌… క్లైమాక్స్‌లో జ‌రిగింది ఇదే…!

గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు ఒక ప్రియురాలి కోసం ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం కాస్తా ఒక వ్య‌క్తి ప్రాణాల మీద‌కు తెచ్చింది. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్ చంద్ స్నేహితులు. ప్రేమ్ చంద్ కు ఓ మహిళతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప్రేమ్ వ‌ద్ద ఫోన్ లేక‌పోవ‌డంతో స్నేహితుడు గోపీ ఫోన్‌తో ఆ మ‌హిళ‌తో మాట్లాడేవాడు. ప్రేమ్ ఆ మ‌హిళ ప్రేమలో ఉన్న‌ట్టు టాక్‌. చివ‌ర‌కు గోపీ కూడా ఫోన్లో ఆ మ‌హిళ‌తో ప‌రిచ‌యం పెంచుకుని మాట్లాడ‌డం ప్రారంభించాడు.

 

ఈ విష‌యం ప్రేమ్‌కు తెలియ‌డంతో గోపీ, ప్రేమ్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 2న ప్రేమ్‌, గోపీని క‌ల‌వాల‌ని క‌బురు పంపాడు. అయితే తాను మాట్లాడే యువ‌తితో గోపీ మాట్లాడ‌డం త‌ట్టుకోలేని ప్రేమ్ గోపీ వ‌చ్చాక కాసేపు క‌బుర్లు చెప్పాడు. ఆ త‌ర్వాత అప్ప‌టికే సిద్ధం చేసుకున్న గ‌డ్డి మందు క‌లిపిన కూల్ డ్రింక్‌ను తాగ‌మ‌ని గోపీకి ఇచ్చాడు. గోపీ ఈ డ్రింక్ పూర్తిగా తాగాక ప్రేమ్ మందు కలిపిన విష‌యం చెప్పాడు.

 

వెంట‌నే ఇంటికి వెళ్లిన గోపీ త‌న త‌ల్లిదండ్రుల‌కు ఆ విష‌యం చెప్ప‌గా వారు అత‌డిని వెంట‌నే ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించటం మొదలెట్టారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో పాటు చివ‌ర‌కు గోపీని గుంటూరు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం మృతి చెందాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మ‌హిళ‌తో ఫోన్ ప‌రిచ‌యం ఓ స్నేహితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news