Sportsటీ 20 క్రికెట్లో పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌

టీ 20 క్రికెట్లో పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌

పాకిస్తాన్ వెట‌రన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక టీ 20 క్రికెట్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్లో ప‌దివేల ప‌రుగులు పూర్తి చేసిన క్రికెట‌ర్ల జాబితాలో చేరిన షోయ‌బ్ ఆసియా నుంచి ఈ ఘ‌న‌త సాధించిన తొలి క్రికెట‌ర్ అయ్యాడు. శ‌నివారం పాక్ టీ 20 క్రికెట్ లీగ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో షోయ‌బ్   కైబర్‌ పఖ్‌తున్‌క్వా జట్టు తరఫున ఆడుతూ బ‌లోచిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ 44 బంతుల్లోనే 77 ప‌రుగులు సాధించాడు.

 

మాలిక్‌ 395 టీ20 మ్యాచ్‌ల్లో 10,027 పరుగులు సాధించాడు. ఇక వెస్టిండిస్ స్టార్ క్రికెట‌ర్ క్రిస్ గేల్ 13, 296 ప‌రుగులు సాధించాడు. గేల్ 404 టీ 20 మ్యాచ్‌ల‌లో ఈ రికార్డు సాధించాడు. ఆ త‌ర్వాత మ‌రో వెస్టిండిస్ క్రికెట‌ర్ పోలార్డ్ 518 మ్యాచ్‌ల‌లో 10, 370 ప‌రుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్‌ నిలిచాడు. కాగా,ఆసియా నుంచి ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా మాలిక్‌ గుర్తింపు పొందాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news