Newsక‌రీంన‌గ‌ర్‌లో దారుణం.. ప్రేమ‌పేరుతో కూతురుకు గ‌ర్భం... పూడ్చిపెట్టిన త‌ల్లి

క‌రీంన‌గ‌ర్‌లో దారుణం.. ప్రేమ‌పేరుతో కూతురుకు గ‌ర్భం… పూడ్చిపెట్టిన త‌ల్లి

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోస‌పోయిన ఓ మైన‌ర్ బాలిక గ‌ర్భం దాల్చి చ‌నిపోయింది. దీంతో ఈ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌కుండా ఆ బాలిక త‌ల్లి ఆమె శ‌వాన్నీ గుట్టు చ‌ప్పుడు కాకుండా పూడ్చి పెట్టింది. త‌న కుమార్తె గ‌ర్భ‌వ‌తి అవ్వ‌డంతో ఆమెకు నాటు ప‌ద్ధ‌తిలో డెలివ‌రీ చేయాల‌ని చూడ‌డంతో అది విక‌టించి న‌వ‌జాత శిశువుతో పాటు ఆ మైన‌ర్ బాలిక కూడా మ‌ర‌ణించింది. దీంతో ఆ త‌ల్లి గోదావ‌రిలో ఆ బాలిక శ‌వాన్నీ పూడ్చిపెట్టింది.

 

ఇరుగు పొరుగు వారు విష‌యం ఆరా తీయ‌గా బాలిక మృతి వెలుగులోకి వ‌చ్చింది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేయ‌డంతో పాటు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే ధ‌ర్మ‌పురికి చెందిన 16 ఏళ్ల మైన‌ర్ బాలిక‌ను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమపేరుతో మోసగించాడు. ఆమెను లొంగదీసుకోవడంతో గర్భం దాల్చింది.

 

బాలిక క‌డుపు నొప్పి అని చెప్ప‌డంతో త‌ల్లి డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌గా ఆమె గ‌ర్భ‌వ‌తి అని తెలిసింది. అప్ప‌టికే నెల‌లు నిండ‌డంతో త‌ల్లి ఎవ్వ‌రికి అనుమానం రాకుండా కుమార్తెను ఇంట్లోనే ఉంచుతోంది. నెల‌లు నిండ‌డంతో ఆసుప‌త్రికి తీసుకువెళితే ప‌రువు పోతుంద‌ని.. ఇంట్లోనే నాటు ప‌ద్ధ‌తిలో డెలివ‌రీ చేయ‌డంతో ముందుగా న‌వ‌జాత శిశువు, ఆ త‌ర్వాత అనారోగ్యంతో బాలిక కూడా చ‌నిపోయింది. రెండు రోజుల క్రితం ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌కుండా త‌ల్లి బాలిక శ‌వాన్నీ పూడ్చిపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news