Newsవీడు ఎంత నీచుడంటే.. కట్నం తేలేద‌ని భార్య ప్రైవేట్ పార్ట్ ఏం...

వీడు ఎంత నీచుడంటే.. కట్నం తేలేద‌ని భార్య ప్రైవేట్ పార్ట్ ఏం చేశాడంటే..

వ‌ర‌క‌ట్నం కోసం దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రోజు ఎక్క‌డో ఓ చోట ఏదో ఒక దారుణం జ‌రుగుతూనే ఉంటోంది. ఎంతోమంది మ‌హిళ‌లు ఈ వేధింపుల‌కు గుర‌వుతూనే ఉంటున్నారు. కొంద‌రు అద‌న‌పు కట్నం కోసం వేధిస్తుంటే.. కొంద‌రు భ‌ర్త‌లు ఏకంగా చెప్ప‌రాని దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో అద‌న‌పు క‌ట్నం కోసం ఓ భ‌ర్త చాలా దారుణానికి ఒడిగ‌ట్టాడు.

 

త‌న భార్య అద‌న‌పు క‌ట్నం తేలేద‌న్న కోపంతో ఆ భ‌ర్త సూర‌జ్‌ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో సూరజ్ అనే వ్యక్తి ఒక సంవత్సరం నుంచి తన భార్యతో గొడవపడుతున్నాడు. ఆమె తల్లిదండ్రులు త‌మ‌కు అద‌న‌పు క్నట్నం ఇచ్చే స్థోమ‌త లేద‌ని చెప్ప‌డంతో పాటు భార్య ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఆస్తులు అన్ని ఇచ్చేయాల‌ని భ‌ర్త‌పై ఫైర్ అయ్యింది.

 

భార్య తనకు ఎదురుతిరిగి మొత్తం లెక్కలు అడగడంతో భ‌ర్త‌ సూరజ్‌కు కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోసి నిప్ప‌టించ‌గా ఆమె కేక‌లు వేసింది. అయితే ఇరుగు పొరుగు వారు ఆ కేక‌లు విని ఆమెను ర‌క్షించి హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. మ‌హిళా సంఘాలు ఆ భ‌ర్త‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news