Moviesప్రేమ‌లో మోస‌పోయి పోలీస్‌స్టేష‌న్ మెట్లెక్కిన హీరోయిన్‌

ప్రేమ‌లో మోస‌పోయి పోలీస్‌స్టేష‌న్ మెట్లెక్కిన హీరోయిన్‌

సినిమా హీరోయిన్లు ప్రేమ‌లు, పెళ్లిళ్లు, డేటింగ్‌లు అన‌డం.. వెంట‌నే విడిపోవ‌డం, బ్రేక‌ప్‌లు చెప్ప‌డం కామ‌న్‌. చాలా మంది హీరోయిన్లు, సినిమా నటీమ‌ణులు తాము ప్రేమ‌లో మోస‌పోయామ‌ని పోలీస్ స్టేష‌న్ల‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఓ హీరోయిన్ సైతం తాను ప్రేమ‌లో మోస‌పోయాన‌ని ఆవేద‌న‌తో కోర్టు మెట్లు ఎక్కింది.  పైగా ఆమె త‌నను ఓ నటుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో పాటు చివ‌ర‌కు మొహం చాటేశాడ‌ని ఆమె వాపోయింది.

 

త‌మిళ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 3తో పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌న్ త‌న‌ను ప్రేమించి మోసం చేశాడంటూ న‌టి స‌న‌మ్ శెట్టి వాపోయింది. ఈ మేర‌కు ఆమె చెన్నైలోని అడ‌యార్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. స‌న‌మ్ శెట్టి ముందు మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ సినిమాల్లో న‌టించింది.

 

 

ఇక బిగ్‌బాస్‌తో పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌న్ త‌మిళ్‌లో న‌టుడిగా అవ‌కాశాలు ద‌క్కించుకుని రాణిస్తున్నాడు. వీరి మ‌ధ్య ఏర్ప‌డిన పరిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. యేడాది పాటు వీరు రిలేష‌న్‌లో ఉన్నారు. స‌న‌మ్ పెళ్లి చేసుకోవాల‌ని కోరిన వెంట‌నే ద‌ర్శ‌న్ త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news