Politicsహైద‌రాబాద్‌లో మ‌ద్యం మ‌త్తులో భ‌ర్త‌నే చంపిన లేడీ డాక్ట‌ర్‌

హైద‌రాబాద్‌లో మ‌ద్యం మ‌త్తులో భ‌ర్త‌నే చంపిన లేడీ డాక్ట‌ర్‌

హైద‌రాబాద్‌లో మ‌ద్యం మ‌త్తులో ఓ లేడీ డాక్ట‌ర్ ఏకంగా భ‌ర్త‌నే చంపేసింది. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్క‌డ స‌న్ సిటీ మాపిల్ టౌన్ విల్లాస్‌లో ఉత్త‌రాఖండ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ దంప‌తులు విశాల్ దివానా(45), సబినా రోషన్ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఇద్దరూ రెండో వివాహంతో ఒక్కటయ్యారు. స‌బీనా డాక్ట‌ర్‌. విశాల్ ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో ప‌ని చేస్తున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

 

ఇక రెండు రోజుల క్రితం ఇద్ద‌రూ క‌లిసి మందు పార్టీ చేసుకున్నారు. ఇక్క‌డ మాటా మాటా పెర‌గ‌డంతో కోపంతో ఊగిపోయిన స‌బీనా కిచెన్‌లో క‌త్తి తీసుకువ‌చ్చి భ‌ర్త‌పై దాడి చేసింది. వెంట‌నే విశాల్‌ను హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లే లోగానే ప్రాణాలు కోల్పోయాడు. విల్లా నెంబ‌ర్ 129 నుంచి కేక‌లు రావ‌డంతో స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలైన డాక్టర్ సబీనాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news