Newsక‌రోనాతో టీఆర్ఎస్ కీల‌క నేత మృతి... భోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే

క‌రోనాతో టీఆర్ఎస్ కీల‌క నేత మృతి… భోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే

క‌రోనాతో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు బ‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆగ‌స్టు చివ‌రి వారంలో ఆయ‌న క‌రోనా భారీన ప‌డ్డారు. కొద్ది రోజులు హోంక్వారంటైన్‌లో ఉన్న ఆయనను ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించ‌గా అక్క‌డ చికిత్స పొంద‌గా అక్క‌డ కూడా ప‌రిస్థితి కంట్రోల్లోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతూ ఆయ‌న ఆదివారం అర్థ‌రాత్రి మృతిచెందారు.

గ‌తంలో ఆదిలాబాద్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా పనిచేసిన ఆయ‌న ఆదిలాబాద్ రూర‌ల్ జ‌డ్పీటీసీగా గెలిచి ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జ‌డ్పీ వైస్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వ్వ‌డంతో పాటు కంట త‌డి పెట్టారు. ఇక ఆరె రాజ‌న్న ఆర్టీసీ కండెక్ట‌ర్ నుంచి జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ స్థాయికి ఎదిగి ప్ర‌జ‌ల మ‌న్న‌నలు పొందారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news