Newsగుంటూరులో టిక్‌టాక్ దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

గుంటూరులో టిక్‌టాక్ దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

గుంటూరు జిల్లాలోని పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన దంప‌తుల‌ను ప‌వ‌న్‌, శైల‌జ‌గా గుర్తించారు. వీరిద్ద‌రు నెల రోజుల క్రిత‌మే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిలో శైలజది చిత్తూరు కాగా, పవన్‌ స్వస్థలం మంగళగిరి. వీరు అంత‌కుముందు టిక్ టాక్ వీడియోలు చేసేవారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు.

అయితే వీరి ప్రేమ శైల‌జ త‌ల్లిదండ్రుల‌కు ఇష్టంలేదు. ఆమె చిత్తూరు నుంచి మంగ‌ళ‌గిరి వ‌చ్చేసి ప‌వ‌న్‌ను పెళ్లి చేసుకుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ప్రేమ‌కు కేసు పెట్ట‌డ‌మేనా ?  లేదా మ‌రోదైనా కార‌ణం ఉందా ? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news