Politicsబ్రేకింగ్‌: జ‌గ‌న్‌కు ఫోన్ చేసి సాయం కోరిన సీఎం

బ్రేకింగ్‌: జ‌గ‌న్‌కు ఫోన్ చేసి సాయం కోరిన సీఎం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి శుక్ర‌వారం ఉద‌యం బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌ కుమార్ ఫోన్ చేశారు. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నితీష్ ఈ ఫోన్ చేసిన‌ట్టు స‌మాచారం. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా జ‌గ‌న్‌ను కోరిన‌ట్టు తెలిసింది. వైసీపీకి రాజ్య‌స‌భలో ఆరుగురు స‌భ్యుల బలం ఉంది.

Hospitals watering down Aarogyasri must face action, says Andhra Pradesh CM  Jagan Mohan Reddy- The New Indian Express

సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే స‌మావేశాల్లో తొలి రోజే డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో బీజేపీ అభ్యర్థిగా హరివంశ్‌ మరోసారి పోటీలో నిలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news