Politicsహైద‌రాబాద్‌లో దారుణం.. మ‌హిళ‌ను రేప్ చేసి ఏం చేశారంటే..

హైద‌రాబాద్‌లో దారుణం.. మ‌హిళ‌ను రేప్ చేసి ఏం చేశారంటే..

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రోజు రోజుకు క్రైం రేటు పెరిగిపోతోంది. కొద్ది రోజుల క్రిత‌మే ఓ యువ‌తి ఏకంగా త‌న‌పై 139 మంది అత్యాచారం చేశార‌ని కేసు న‌మోదు చేయ‌డంతో ఈ సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ 35 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మ‌హిళ‌ను దారుణంగా రేప్ చేసి చంపేశారు. సికింద్రాబాద్‌లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Uttar Pradesh: Woman burnt alive in temple after gang-rape

రాష్ట్రపతి రోడ్డులోని రైల్వే వంతెన పక్కన ఉన్న మూత్రశాలలో మంగళవారం ఉదయం ఓ మహిళ( 35) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృత‌దేహంపై దుస్తులు లేవు. దుప్ప‌టి మాత్రం క‌ప్పి ఉంది. ఆమెపై కొంద‌రు సామూహికంగా లేదా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాచారం చేసి చంపేసి ఉంటార‌ని తెలుస్తోంది. ఆమెను హ‌త్య చేసిన త‌ర్వాత ఆ మృత‌దేహాన్ని మూత్ర‌శాల‌లో ప‌డేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news