Gossipsక్రిష్ క‌ష్టాలు ఎవ్వ‌రికి రాకూడ‌దు.. మెగా దెబ్బ ప‌డిపోయిందిగా..!

క్రిష్ క‌ష్టాలు ఎవ్వ‌రికి రాకూడ‌దు.. మెగా దెబ్బ ప‌డిపోయిందిగా..!

టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరున్న క్రిష్ సినిమాల‌కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ ఏదో ఒక అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉంటున్నాయి. క్రిష్ సినిమా అంటే దాని చుట్టూ ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంది. ఇక ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న రెండు సినిమాల విష‌యంలో కూడా ఏదో ఒక అవాంత‌రం ఎదుర‌వుతుండ‌డంతో క్రిష్ సైతం నిరాశ‌తో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ హీరోగా ఏఎం. ర‌త్నం శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మించే సినిమాను  క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌తో డైరెక్ట్ చేసే ఛాన్స్ అంటే క్రిష్‌కు మామూలు ఛాన్స్ కాదు. ఈ సినిమా హిట్ అయితే క్రిష్ రేంజ్ వేరుగా ఉంటుంది. అయితే ప‌వ‌న్ సినిమాను 15 రోజులు షూటింగ్ చేశాక క‌రోనా రావ‌డంతో ఆపేశారు. ఇప్పుడు ఈ సినిమా తిరిగి ప్రారంభ‌మ‌య్యే విష‌యంలో అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఐదు నెల‌ల స‌మ‌యం వేస్ట్ అయ్యింది. ఇప్పుడు ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ కంప్లీట్ చేసి ఆ త‌ర్వాత క్రిష్ ప్రాజెక్టుకు వ‌స్తాడా ?  లేదా ?  హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కిస్తాడా ? అన్న సందేహం ఉంది.

ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేసేద్దాం అనుకున్న క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ తో సినిమా మొదలు పెట్టాడు. క‌రోనాతో పాటు అనేక కార‌ణాల‌తో వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి బ్రేక్ పడిందట. ఇక ప‌వ‌న్ ప్రాజెక్టు బ‌డ్జెట్ విష‌యంలో కోత‌లు ఉంటాయ‌ని.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు తిరిగి సెట్స్ మీద‌కు వెళుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ట‌. ఏదేమైనా క్రిష్‌కు రెండు మెగా షాక్‌ల‌తో ఆయ‌న క‌ష్టాలు మామూలుగా లేవ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news