Moviesవాళ్ల దొంగ ఏడుపులు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌నం

వాళ్ల దొంగ ఏడుపులు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌నం

కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తో బాగా పాపుల‌ర్ అవుతోన్న శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే అవుతోంది. ఇక డ్ర‌గ్స్ ఉదంతంలో హీరోయిన్ల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌రోసారి ఆమె ర‌కుల్‌ప్రీత్ సింగ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఫైర్ అయ్యింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా ఫేస్‌బుక్ లైవ్ పెట్టింది. ఈ లైవ్‌లో ఆమె ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చేసింది. ఇక బిగ్‌బాస్ గురించి ఆమెను ప‌లువురు ప్ర‌శ్నించ‌గా ఒక్క‌సారిగా ఫైర్ అయిపోయింది.

అస‌లు బిగ్ బాస్ షో అంటేనే త‌నకు న‌చ్చ‌ద‌ని.. అందులో పార్టిసిపెంట్స్ దొంగ ఏడుపులు చూడ‌డం త‌న వ‌ల్ల కాద‌ని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో త‌న‌కు దొంగ ఏడుపులు ఎక్క‌వుగా వినిపిస్తాయ‌ని… త‌న‌కే క‌నుక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటే వాళ్లంద‌రి అస‌లు రంగు బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్ప‌డంతో పాటు వాళ్లు నిజ స‌ర్వ‌రూపాలు అన్ని మీ ముందు ఉంచుతాన‌ని తెలిపింది.

తాను హౌస్‌లో ఉంటే షో ఇప్పుడున్నట్టు ఫేక్ కాకుండా అస‌లు రియాలిటీ చూపిస్తాన‌ని చెప్పింది.  మరోవైపు బిగ్ బాస్ సీజన్ 4 లో ఉన్న వాళ్ళు ఎవరూ తక్కువ కాదు అంటూ వారిపై విమర్శలు చేసిన ఆమెపై బిగ్‌బాస్ అభిమానులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news