Moviesప్ర‌భాస్ నుంచి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఎనౌన్స్‌మెంట్‌... క్రేజీ డైరెక్ట‌ర్‌తో పాన్...

ప్ర‌భాస్ నుంచి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఎనౌన్స్‌మెంట్‌… క్రేజీ డైరెక్ట‌ర్‌తో పాన్ ఇండియా సినిమా…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే ఒక‌దానిని మించిన క్రేజీ ప్రాజెక్టుల‌తో సంచ‌ల‌నం రేపుతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్‌, వైజ‌యంతీ మూవీస్ – నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టు ఆ వెంట‌నే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఒక‌దానిని మించిన మ‌రొక క్రేజీ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తోన్న ప్ర‌భాస్ రెండు మూడు రోజుల్లో మ‌రో దిమ్మ‌తిరిగే పాన్ ఇండియా ప్రాజెక్టు అనౌన్స్‌మెంటుతో మ‌న ముందుకు రానున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలిసింది.

అదే ప్రభాస్ – కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్ నీల్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్టుపై రెండు , మూడు రోజుల్లో ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ నుంచి మ‌రో క్రేజీ ఎనౌన్స్ మెంట్ వ‌స్తుంద‌న్న వార్త‌లు ముందే లీక్ కాగా.. దీనిపై ఆరా తీయ‌డంతో ప్ర‌శాంత్ నీల్ చెప్పిన క‌థ‌కు ప్ర‌భాస్ ఓకే చెప్పాడ‌ని తెలిసింది.

ఈ క్రేజీ ప్రాజెక్టును యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంద‌ని చెపుతున్నారు. అయితే రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్‌, ఆది పురుష్ కంప్లీట్ అయ్యేస‌రికే మూడేళ్లు ప‌ట్టేలా ఉంది. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ – ప్ర‌భాస్ ప్రాజెక్టు ఉండొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news