Gossipsప‌వ‌న్ నాలుగు సినిమాల్లో ఆ ఒక్క‌దానికే క్రేజ్ ఉందా..!

ప‌వ‌న్ నాలుగు సినిమాల్లో ఆ ఒక్క‌దానికే క్రేజ్ ఉందా..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో దుమ్ము రేపుతున్నాడు. ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ ( బాలీవుడ్ పింక్ రీమేక్‌), క్రిష్ సినిమా ఆ వెంట‌నే హ‌రీష్ శంక‌ర్ సినిమా, ఆ త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి  – రామ్ తాళ్లూరి సినిమాలు లైన్లో ఉన్నాయి. వ‌కీల్ సాబ్ త‌ర్వాత క్రిష్ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందా ?  లేదా హ‌రీష్ శంక‌ర్ సినిమా లైన్లో ఉంటుందా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. క్రిష్ తెర‌కెక్కించే సినిమా ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమాలు నాలుగు లైన్లో ఉన్నా.. ఈ నాలుగు ప్రాజెక్టుల కంటే కూడా హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టే క్రేజీ ప్రాజెక్టుగా ఉంది. వ‌కీల్‌సాబ్ బాలీవుడ్ హిట్ సినిమా. ఇది క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్ తక్కువ ఉన్న క‌థ‌. ఇక క్రిష్ రెండు ప్లాపుల త‌ర్వాత చేస్తోన్న సినిమా చారిత్రక క‌థాంశం కావ‌డంతో ఎలా ఉంటుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక సురేంద‌ర్ రెడ్డి సినిమా కంటే కూడా ఇప్పుడు అంద‌రి దృష్టి హ‌రీష్ శంక‌ర్ సినిమా మీదే ఉంది.

 

గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. హరీష్ శంకర్ తెరకెక్కించబోయే pspk 28 అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇక గ‌బ్బ‌ర్‌సింగ్‌లో పోలీస్‌గా ప‌వ‌న్ చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు పేలాయి. మ‌రోసారి అదే కాంబో రిపీట్ అవుతుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news