Newsయువ‌తికి బీజేపీ నేత వేధింపులు... చెప్పుతో రోడ్డుమీదే వాయించేసింది...

యువ‌తికి బీజేపీ నేత వేధింపులు… చెప్పుతో రోడ్డుమీదే వాయించేసింది…

ఓ బీజేపీ నేత ఓ యువ‌తి వెంట నాలుగు నెల‌లుగా వెంట ప‌డుతున్నాడు. చివ‌ర‌కు అత‌డికి ఆ యువ‌తి స‌రైన శాస్తి చేసింది. యూపీలోని కాన్పూర్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. బీజేపీ నేత మనీష్ పాండ్యా… గోవిందనగర్ అసెంబ్లీ సీటు పరిధిలోని కల్యాణ్‌పూర్ ప్రాంత బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఓ యువ‌తి వెంట మ‌నీష్ నాలుగు నెలలుగా ప‌డ‌డంతో పాటు తీవ్రంగా లైంగీక వేధింపులకు గురి చేస్తున్నాడు. త‌న‌తో స్నేహం చేయాల‌ని కూడా ఒత్తిడి చేస్తున్నాడు.

ఆమె ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులంతా ఆ బీజేపీ నేతను చెప్పులతో కొట్టి, పోలీసులకు అప్పగించారు. కుటుంబ స‌భ్యుల స‌హకారంతోనే ఆ బీజేపీ నేత‌ను రోడ్డుపై నిర్బంధించి చెప్పుల‌తో కొట్టేసింది. దీంతో అక్క‌డ ఉన్న వారు అంద‌రూ క‌లిసి ఆ మ‌నీస్ పాండ్యాపై దాడి చేశారు. త‌ర్వాత అత‌డిని పోలీసులకు అప్పగించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news