Sportsవ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విరుష్క... ప్ర‌పంచంలోనే అరుదైన ఘ‌న‌త‌

వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విరుష్క… ప్ర‌పంచంలోనే అరుదైన ఘ‌న‌త‌

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి దంపతులుకు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరు ఏం చేసినా పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. భార‌తీయుల‌చే విరుష్క‌గా ముద్దుగా పిలుచుకోబ‌డే ఈ జంట తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ పాపులర్‌ సిరీస్‌ ‘టేక్‌ ఏ బ్రేక్’‌లో కనిపించిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించే ఈ సిరీస్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తిరుగులేని పాపులారిటీ ఉంది. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ యాజ‌మాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌పంచ వ్యాప్తంగా కేవ‌లం 59 ఐకానిక్ ప‌ర్స‌నాలీటీస్‌ను మాత్ర‌మే ఫాలో అవుతోంది.

 

ఇప్పుడు ఈ లిస్టులోకి విరుష్క దంప‌తులు కూడా చేరారు. భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక కపుల్‌గా వీరు రికార్డు సృష్టించారు. ఈ సిరీస్‌లో యూత్‌ ఐకాన్‌లుగా నిలిచే వారి వ్యక్తిగత జీవితాల గురించి లోతైన విషయాలను వెల్లడిస్తారు. ఇక విరుష్క‌ల టేక్ ఏ బ్రేక్‌లో వీరు వ్య‌క్తిగ‌త జీవితాలే కాక‌.. వీరి ఇష్టాఇష్టాల‌పై కూడా ఒక‌రినొక‌రు ప్ర‌శ్న‌లు సంధించుకుంటారు. వీరి దాంప‌త్య జీవితం గురించి కూడా ప‌లు అంశాలు చెప్పుకోవ‌చ్చు. ఇక 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియోను 150 మిలియన్ల మంది విక్షించి రికార్డు సృష్టించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news