Politicsసుశాంత్ సూసైడ్ కేసులో అత‌డే కీల‌క‌మా... ఛానెల్ స్టింగ్ ఆప‌రేష‌న్లో ముందు...

సుశాంత్ సూసైడ్ కేసులో అత‌డే కీల‌క‌మా… ఛానెల్ స్టింగ్ ఆప‌రేష‌న్లో ముందు రోజు ఏం జ‌రిగిందంటే…!

దివంగ‌త బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌తి ఒక్కరు స్పందిస్తున్నారు. సీబీఐ విచార‌ణ‌లో ఎన్నో విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మాట్లాడుతూ సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయన ఇంటి వ‌ద్ద రెండు అంబులెన్స్‌లు ఎందుకు ఉన్నాయి ? సుశాంత్‌కు బాగా న‌మ్మ‌క‌స్తుడు అయిన శ్యామ్యూల్ హోకిప్ మిస్సింగ్ అవడంపై కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

 

ఇక సుశాంత్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో బాంద్రాలోని ఆయ‌న నివాసానిరి రెండు అంబులెన్స్‌లు రావ‌డంపై కూడా ప‌లు సందేహాలు అప్పుడే వ్య‌క్త‌మ‌య్యాయి. ముంబై పోలీసులు సైతం ఆ దిశ‌గా విచార‌ణ చేప‌ట్టలేద‌ని కూడా ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ మ‌ర‌ణానికి ముందు రోజు అంటే జూన్ 13న రాత్రి అత‌డితో పాటే అత‌డి న‌మ్మ‌క‌స్తుడు అయిన శామ్యూల్ హోకిప్ కూడా ఉన్నారనే విషయం బయటపడింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఇదే విషయం బయటకు వచ్చింది.

 

అదే శామ్యూల్ సుశాంత్ మృతి చెందిన రోజు నుంచి నేటి వ‌ర‌కు క‌న‌ప‌డ‌డం లేదు. దీని వెన‌క ఏదో సీక్రెట్ ఉంద‌న్న సందేహాలు సైతం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శామ్యూల్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌లేదంటే అస‌లు బ‌తికే ఉన్నాడా ? అన్న అనుమానాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అయితే సుశాంత్ డెడ్ బాడీకి పోస్టుమార్ట‌మ్ చేసిన డాక్ట‌ర్‌ను మ‌రోసారి విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news