Moviesసుశాంత్ మృత‌దేహం ద‌గ్గ‌ర రియా ఏం చేసింది... త‌ప్పు చేశాన‌న్న పశ్చాత్తాపంతోనేనా..?

సుశాంత్ మృత‌దేహం ద‌గ్గ‌ర రియా ఏం చేసింది… త‌ప్పు చేశాన‌న్న పశ్చాత్తాపంతోనేనా..?

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం త‌ర్వాత రోజులు గ‌డిచే కొద్ది అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సుశాంత్ గురించి అనేక కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో ముందు నుంచి కూడా సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని అంద‌రూ అనుమానిస్తూ వ‌స్తున్నారు. ఇక సుశాంత్ కుటుంబ స‌భ్యులు సైతం రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ఆనుమానిస్తూ కేసులు పెట్ట‌న సంగ‌తి తెలిసిందే.

Sushant Singh Rajput to do next film with Riya Chakraborty ...

అయితే తాజాగా మ‌రో మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుశాంత్ మృత‌దేహాన్ని కూప‌ర్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించిన‌ప్పుడు రియా మార్చురీకి వెళ్లి సుశాంత్ మృత‌దేహం చూసింది. అప్పుడు ఆమె సుశాంత్ మృత‌దేహం తాకీ మ‌రీ సారీ చెప్పార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి సుర్జీత్‌సింగ్ రాథోర్ చెపుతున్న‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సుశాంత్ మృత‌దేహం తాకిన ఆమె సారీ బాబూ అని చెప్పింద‌ని.. ఆ స‌మ‌యంలో ఆమె మొఖంలో ప‌శ్చాత్తాప భావం కూడా క‌న‌ప‌డింద‌ని అత‌డు చెప్పిన విష‌యం మీడియా వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతోంది.

 

సుర్జీత్ సింగ్ రాథోర్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకి వెల్లడించిన వివరాల ప్రకారం సుశాంత్ మృత‌దేహం చూసేందుకు సోద‌రుడితో ఆమె కూప‌ర్ హాస్ప‌ట‌ల్‌కు వ‌చ్చింద‌ని.. అప్పుడు తాను సుశాంత్ మృతదేహంపై ఉన్న క్లాత్ తొల‌గించిన‌ప్పుడు చేయి వేసి ఏడ్చేసింద‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. సుశాంత్ విష‌యంలో ఆమె త‌ప్పు చేసినందువ‌ల్లే సారీ చెప్పింద‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాల ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news