Gossipsక్లాస్‌, మాస్ ద‌ర్శ‌కుల‌ను లైన్లో పెట్టిన చెర్రీ... ఆ ఇద్ద‌రు వీళ్లే..!

క్లాస్‌, మాస్ ద‌ర్శ‌కుల‌ను లైన్లో పెట్టిన చెర్రీ… ఆ ఇద్ద‌రు వీళ్లే..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు త‌న తండ్రితో క‌లిసి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆచార్య సినిమాను కూడా ఫినిష్ చేయ‌నున్నాడు. ఆచార్య వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతుంటే ఆర్ ఆర్ ఆర్ కాస్త టైం ప‌ట్టేలా ఉంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత చ‌ర‌ణ్ ఏయే ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తాడ‌న్న‌ది నిన్న‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

ఇక ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్ ఈ రెండు సినిమాల త‌ర్వాత ఓ క్లాస్‌, ఓ మాస్ ద‌ర్శ‌కుల‌ను లైన్లో పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. వారే టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో సంచ‌ల‌నం రేపిన సందీప్ వంగ‌, గౌత‌మ్ తిన్న‌నూరి. అర్జున్‌రెడ్డితో సందీప్ వంగ టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ తిరుగులేని డైరెక్ట‌ర్ అయిపోయాడు.

ఇక గౌత‌మ్ జెర్సీతో ఇక్క‌డ క్లాసిక్ హిట్ త‌న ఖాతాలో వేసుకుని.. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఇద్దరి దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో తరహా సినిమా స్పెషలిస్టులు వీరిద్దరి పేర్లే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఏ దర్శకునితో చరణ్ ముందుగా సినిమా చేస్తాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news