Gossipsక‌రోనా‌ను లెక్క‌చేయ‌ని మ‌హేష్‌... బిగ్ డేరింగ్ స్టెప్‌

క‌రోనా‌ను లెక్క‌చేయ‌ని మ‌హేష్‌… బిగ్ డేరింగ్ స్టెప్‌

ఓ వైపు క‌రోనా వీర‌విహారం చేస్తున్నా.. దేశ‌వ్యాప్తంగాను.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో సినిమా వాళ్లు షూటింగ్ చేసేందుకు సాహ‌సించ‌డం లేదు. పెద్ద పెద్ద హీరోలు సైతం త‌మ సినిమాల షూటింగ్‌లు ఆపేసి రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ టైంలో టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు మాత్రం క‌రోనాను లెక్క చేయ‌కుండా డేరింగ్ స్టెప్ వేసి మ‌రీ ముందుకు దూసుకు పోతున్నాడు. ఇప్ప‌టికే మూడు వ‌రుస హిట్ల‌తో మంచి జోరుమీదున్న మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా ప్రీ లుక్ తోనే తారా స్థాయి అంచనాలను నెలకొల్పుకుంది. అయితే తొలి షెడ్యూల్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా ? అని అంద‌రూ వెయిటింగ్‌లో ఉన్నారు. క‌రోనా కేసులు విజృంభిస్తున్న నేప‌థ్యంలో మిగిలిన స్టార్ హీరోలు త‌మ సినిమాల షూటింగ్‌లు ప్రారంభించేందుకు భ‌య‌ప‌డుతున్నా మ‌హేష్ మాత్రం చాలా డేరింగ్ స్టెప్ వేసి మ‌రీ స‌ర్కారు వారి పాట షూటింగ్‌కు రెడీ అవుతున్నాడ‌ట‌.

 

అయితే ముందు మ‌న‌దేశంలో జ‌రిగే పార్ట్‌ను షూట్ చేస్తారా ? లేదా యూఎస్ / యూర‌ప్ షెడ్యూల్ కంప్లీట్ చేశాక మ‌న దేశంలో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారా ? అన్న‌ది చూడాల్సి ఉంది. ఏదేమైనా మ‌హేష్ బిగ్ డేరింగ్ స్టెప్ వేస్తున్నాడ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news