Gossipsవిజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్‌పై షాక్ ఇచ్చిన కీర్తి సురేష్‌...!

విజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్‌పై షాక్ ఇచ్చిన కీర్తి సురేష్‌…!

మామూలు సినిమాలు చేసుకునే కీర్తి సురేష్‌ను మ‌హాన‌టి సినిమా ఓ రేంజ్‌కు తీసుకు వెళ్లిపోయింది. ఈ సినిమా త‌ర్వాత కీర్తికి మ‌హాన‌టి ఇమేజ్ వ‌చ్చేసింది. మ‌హాన‌టిగా కీర్తి జీవించేసింద‌నే చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో ఎన్ని బ‌యోపిక్‌లు వ‌చ్చినా కూడా మ‌హానటి స్థాయిని ఎంత మాత్రం అందుకోలేక‌పోతున్నాయి. ఈ సినిమాతో ఆమె ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుని సత్తా చాటింది. ఇక ఇప్పుడు వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తోంది.

మ‌ధ్య‌లో ఆమె న‌టించిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో ఆమె క్రేజ్ త‌గ్గుతోంద‌న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే క్ర‌మంలోనే కీర్తి ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇదిలా ఉంటే న‌టుడు న‌రేష్‌, త‌న త‌ల్లి దివంగ‌త నటుడు, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల కథను సినిమాగా రూపొందించేందుకు ఆమె కుమారుడు, నటుడు నరేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌నిర్మ‌ల రోల్ పోషించేందుకు న‌రేష్ కీర్తి సురేష్‌ను సంప్ర‌దించాడ‌ని టాక్ వ‌చ్చింది.

ఆ త‌ర్వాత ఆ బ‌యోపిక్ ఊసే లేకుండా పోయింది. దీనిపై టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ఏంటంటే ఆమె క‌మ‌ర్షియల్ సినిమాలు చేసే క్ర‌మంలో ఈ బ‌యోపిక్‌లో చేసేందుకు నో చెప్పింద‌ట‌. కీర్తీ  ప్రస్తుతానికి తెలుగు తమిళ చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది. నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌లో కూడా న‌టిస్తోంది. ఇక ఆమె మిస్ ఇండియా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక త‌మిళ్‌లో కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అందుకే ఆమె విజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్‌లో న‌టించ‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని చెప్పింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news