Sportsబ్రేకింగ్‌: టీం ఇండియా మాజీ స్టార్ క్రికెట‌ర్ ప‌రిస్థితి విష‌మం

బ్రేకింగ్‌: టీం ఇండియా మాజీ స్టార్ క్రికెట‌ర్ ప‌రిస్థితి విష‌మం

టీం ఇండియా మాజీ స్టార్ క్రికెట‌ర్‌, యూపీ మంత్రి చేతన్‌ చౌహాన్‌ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కొద్ది రోజులుగా ఆయ‌న కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న్ను ల‌క్నోలోని సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ స‌మ‌స్య‌కు తోడుగా కిడ్నీ, బీపీ స‌మ‌స్య‌లు రావ‌డంతో వెంటిలేట‌ర్‌పై ఆయ‌న్ను వెంటిలేట‌ర్‌పై ఉంచి మ‌రీ డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారు.

 

రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన చేతన్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబసభ్యులు జూలైలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ప్రస్తుతం చౌహాన్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ ‌153 పరుగులు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news