Politicsబ్రేకింగ్‌: ఏపీ మంత్రికి క‌రోనా పాజిటివ్‌.. అపోలోలో చికిత్స‌

బ్రేకింగ్‌: ఏపీ మంత్రికి క‌రోనా పాజిటివ్‌.. అపోలోలో చికిత్స‌

సెల‌బ్రిటీల‌ను వెంటాడుతోన్న కరోనా మ‌హ‌మ్మారి లిస్టులో మ‌రో మంత్రి చేరారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయ్యింది. ఏపీలో క‌రోనా స్వైర‌విహారం చేస్తుండ‌డంతో రోజు రోజుకు కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఇక్క‌డ కేసులు 1.60 ల‌క్ష‌లు దాటేశాయి. ఇక మ‌ర‌ణాలు కూడా 1500కు చేరువ‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డ్డారు. తాజాగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా క‌రోనా భారీన ప‌డ్డారు.

 

ఆయ‌న వారం రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. మొదట నెగెటివ్‌ రాగా మంగళవారం సాయంత్రం పరీక్షల్లో ‌కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. ప‌లువురు వైసీపీ నేత‌లు బాలినేని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news