Newsమైన‌ర్ బాలిక‌పై 30 మంది రేప్‌... షాక్‌లో ప్ర‌ధాని..

మైన‌ర్ బాలిక‌పై 30 మంది రేప్‌… షాక్‌లో ప్ర‌ధాని..

అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఒకరు కాదు…ఇద్దరు కాదు ఏకంగా 30 మంది అత్యాచారం చేశారు. 16 సంవ‌త్స‌రాల ఆ మైన‌ర్ బాలిక ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమెపై క‌న్నేసిన కొంద‌రు దండుగులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ గ‌దిలో బంధించి మ‌రీ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు అత్యాచారం చేశారు. ఇజ్రాయెల్ దేశంలోని ఈలాత్ నగరంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ రిసార్ట్‌లో ప‌నిచేస్తోన్న 16 ఏళ్ల బాలిక‌ను బంధించిన ఆ దండుగులు అదే రిసార్ట్‌లో ఆమెను బంధించి ఏకంగా 30 మంది వ‌ర‌కు ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ అత్యాచారం త‌ర్వాత ఆ బాలిక ఒక్క‌సారిగా షాక్‌లోకి వెళ్లింది. వారం త‌ర్వాత ఆమె కోలుకుని జ‌రిగిన విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టి ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఆ అత్యాచార ఘటనతో ఇజ్రాయెల్ దేశం ఉలిక్కిపడింది. మైన‌ర్ బాలిక‌పై ఏకంగా 30 మంది అత్యాచారం చేస్తే ప్ర‌భుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇజ్రాయిల్‌లో ప్ర‌ధాన న‌గ‌రాలుగా ఉన్న టెల్ అవివ్‌, జెరూసలేం నగరాల్లో ప్రజలు భారీ నిరసనలు చేపడుతున్నారు. ఈ ఘటనపై దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇది షాకింగ్‌గా ఉందని, అసలు మాటలు రావడం లేదన్నారు. నిందితులపై విచారణకు ఆదేశించామన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news