Moviesప్రతిరోజూ పండగే సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?

ప్రతిరోజూ పండగే సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?

మెగా కంపౌండ్ నుండి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ ఊపు మీద ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీలో భారీ తారాగణం నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సెన్సార్ వారు U సర్టిఫికెట్ జారీ చేశారు.

ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ప్రతిరోజూ పండగే సినిమా చూసి పండగ చేసుకోవచ్చని అన్నారు. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు తగ్గిపోవడంతో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే అవకాశం కోల్పోతున్న ఆడియెన్స్, ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చని చెప్పారు. మారుతి ఎంచుకున్న కథ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని వారు కితాబిచ్చారట. సినిమాలో ఎమోషన్, రొమాన్స్, కామెడీ పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, సత్యరాజ్, రావు రమేష్‌లతో పాటు భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news