Gossipsరెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయిందిగా..!

రెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయిందిగా..!

స‌హ‌జంగా చాలా మంచి సెల‌బ్ర‌టీలు ఇన్స్టాగ్రామ్‌ను యూజ్ చేస్తు ఉంటారు. వాళ్ల‌కు టైం దొరికిన‌ప్పుడ‌ల్లా వారి విష‌యాల‌ను ఫ్యాన్స్‌తో పాలుపంచుకుంటారు. అయితే మ‌రి కొంద‌రు అదే ప‌నిగా పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌తోనే గ‌డుపుతుంటారు. ఈ క్ర‌మంలోనే వాళ్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తుంటారు. దీనిని బ‌ట్టీ దానికి వాళ్లు ఎంద‌గా ఎడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఖాతాలోనే రెజీనా కూడా వ‌చ్చి ప‌డింది.

ఇటీవ‌ల రెజీనా అడివి శేష్‌, నవీన్‌చంద్ర క‌లిసి న‌టిస్తున్న‌ `ఎవ‌రు` చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి వెంకట్‌ రాంజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాను ఇన్స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో ప్ర‌మోట్ చేసుకుంటుంద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈమెకు ఇన్‌స్టాలో ఏకంగా మిలియ‌న్ పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం సెల్ఫ్ ప్ర‌మోష‌న్ పేరుతో అభిమానుల‌కు మ‌రింత ఆక‌ట్టుకుంటోంది.

అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్స‌వం రోజున‌ `ఎవ‌రు` సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రెజీనా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. అదే విధంగా ఎక్క‌డ‌కు వెళ్లిన లైవ్ పెట్టి ఇంస్టాలో షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మీడియాతో పంచుకున్న ఇంటర్వ్యూ ని కూడా లైవ్ పెట్టేసి రిపోర్టర్ల మొఖాలను చూపించింది. దీంతో ఆ రిపోర్ట‌ర్లు వింత‌గా ఫీలై రెజీనా ఇన్స్టాగ్రామ్‌కు బాగా ఎడిక్ట్ అయిపోయి అదే పిచ్చి మీద ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఎవ‌రు ఏమ‌నుకున్నా రెజీనా మాత్రం ఐ డోన్ట్ కేర్ అన్న‌ట్టుగా ఇన్‌స్టాలో త‌న సెల్ఫ్ ప్ర‌మోష‌న్‌తో బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news