Gossipsవైడ్ బాల్‌తో విలియ‌మ్స‌న్ వికెట్ తీసిన కోహ్లీ..

వైడ్ బాల్‌తో విలియ‌మ్స‌న్ వికెట్ తీసిన కోహ్లీ..

ఇంగ్లండ్లో నెల‌న్న‌ర రోజులుగా జ‌రుగుతోన్న ప్రపంచకప్‌-2019 టోర్నీ తుది దశకు చేరింది. మెగా టోర్నీలో తొలి రసవత్తపోరుకు రంగం సిద్దమైంది. ప్ర‌స్తుతం ఇండియా వైజ్‌గా ఎక్క‌డ చూసినా క్రికెట్ నామ‌స్మ‌ర‌ణ‌తో అభిమానులు ఉర్రూత‌లూగిపోతున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విచ‌త్రం ఏంటంటే 11 ఏళ్ల నాటి సంఘ‌ట‌నే ఈ రోజు కూడా పున‌రావృతం కాబోతుంది.

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తలపడ్డ సారథులే ఈ మెగా టోర్నీలో ఒకరినొకరు ఢీ కొంటున్నారు. అప్పుడు భారత సారథి విరాట్‌ కోహ్లి పైచేయి సాధించగా.. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే చర్చ క్రికెట్‌ వర్గాల్లో ఊపందుకుంది. ఆ మ్యాచ్‌లో సెమీఫైనల్లో కోహ్లీ సార‌థ్యంలోని భార‌త్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని కీవీస్‌పై గెలిచింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే కెప్టెన్లు మెగా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సార‌థులుగా మ‌ళ్లీ ఇవే రెండు జ‌ట్లు సెమీస్ ఆడుతున్నాయి.

ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విష‌యాన్ని కెప్లెన్ కోహ్లీ గుర్తు చేసుకోవ‌డం విశేషం. నాటి అండ‌ర్ ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైనల్లో ఓ వైడ్‌ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే తాను చాలా డేంజ‌ర్ బౌల‌ర్‌ను అని.. అప్పుడే విలియ‌మ్స‌న్‌ను అవుట్ చేశాన‌ని.. అయితే ఇప్పుడు త‌మ బౌల‌ర్లు వారి ప‌ని క‌రెక్టుగా నిర్వ‌హిస్తుండ‌డంతో త‌న‌కు బౌలింగ్ చేసే ఛాన్స్ లేద‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news