Gossipsమహర్షికి ఇదే ప్లస్ పాయింట్.. కాస్కోండి ఆడియెన్స్!

మహర్షికి ఇదే ప్లస్ పాయింట్.. కాస్కోండి ఆడియెన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మొదలుకొని ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ వరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా దుమ్ము లేపడం ఖాయమని సూర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగడం అందరం చూశాం. ఇక ఈ సినిమా విశేషాల గురించి చిత్ర యూనిట్ చాలా గొప్పగా చెప్పారు. అయితే ఈ సినిమాలో ఒక్క అంశం మాత్రం సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. మహేష్ ప్రతి సినిమాలో ఏదో ఒక అంశం సినిమాకే హైలైట్ కావడం మనకు తెలుసు. ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ఇదే రిపీట్ కానుంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు మహర్షి సినిమాకు మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ 20 నిమిషాలకు కనెక్ట్ కాని వారుండరు అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం మాత్రం గ్యారెంటీ అని తెలుస్తోంది.

మహేష్ కొత్త లుక్‌లో కనిపించే ఈ సినిమాలో డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 9న ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news