Newsఅఖిల్ కోసం ఎన్.టి.ఆర్.. వెయిటింగ్ బ్రదర్ అంటూ ట్వీట్..!

అఖిల్ కోసం ఎన్.టి.ఆర్.. వెయిటింగ్ బ్రదర్ అంటూ ట్వీట్..!

అక్కినేని అఖిల్ మూడవ సినిమా మిస్టర్ మజ్ ను ఈ నెల 25న రిలీజ్ కాబోతుంది. తొలిప్రేమతో తొలి సినిమా హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తన రెండో ప్రయత్నంగా చేసిన సినిమా మిస్టర్ మజ్ ను. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ తో నిధి అగర్వాల్ జత కట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెషన్ లో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నట్టు తెలుస్తుంది.

ఈమధ్య ఎన్.టి.ఆర్ ఇలాంటి ఈవెంట్లకు స్పెషల్ గెస్టుగా వస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఆల్రెడీ మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మహేష్ అన్నా అంటూ మహేష్ మీద అభిమానాన్ని చూపిన తారక్ ఈసారి అఖిల్ కోసం వస్తున్నాడు. ఇక ఈ విషయం ప్రస్థావిస్తూ మీ సపోర్ట్ కు చాలా థ్యాంక్స్ బ్రదర్. నీతో కలిసి వేదిక షేర్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నా.. చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ అఖిల్ ట్వీట్ చేశాడు. తానో స్టార్ హీరో అయినా రాబోతున్న యువ హీరోలకు మంచి సపోర్ట్ గా నిలుస్తున్నాడు అఖిల్.

ఇక మిస్టర్ మజ్ ను సినిమాతో అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి సినిమాల సందడి మాములుగానే ఉంది కాబట్టి జనవరి 25న వచ్చే అఖిల్ సినిమా కచ్చితంగా మంచి ఫలితం తెచ్చుకునే అవకాశం ఉంది. మరి అఖిల్ ఈ అవకాశాన్ని వాడుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ బాగున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news