Gossipsనందమూరి ఫ్యాన్స్ కి అడ్డంగా బుక్కైన మహేష్..!

నందమూరి ఫ్యాన్స్ కి అడ్డంగా బుక్కైన మహేష్..!

మహేష్, ఎన్.టి.ఆర్ మంచి స్నేహితులు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యి మహేష్ మీద తనకు ఉన్న అభిమానం చాటుకున్నాడు. అయితే ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్స్ అనేవి సర్వాసాధారణం. ఒక హీరోని మరో హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుండటం చూస్తూనే ఉంటాం అయితే అలాంటి అవకాశాన్ని కూడా ఇస్తుంటారు స్టార్స్. ఇదంతా ఎందుకు అంటే మహేష్ సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన 2.ఓపై స్పందించడం నందమూరి ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అంత పెద్ద హిట్టైనా స్పందించని మహేష్ 2.ఓపై ట్వీట్ చేయడం నందమూరీ ఫ్యాన్స్ కు నచ్చలేదు.

అందుకే మహేష్ పై నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ ట్రోల్స్ ను ఘట్టమనేని ఫ్యాన్స్ అడ్డుకుంటున్నారు. మహేష్ 2.ఓను పొగుడుతూ ట్వీట్ చేయడం జరిగింది. ఇదే కాదు ఈమధ్య వచ్చిన విజయ్ సర్కార్ సినిమాపై మహేష్ ప్రశంసల వర్షం కురిపించాడు. మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేశాడు మహేష్ ఆ కృతజ్ఞతతో సర్కార్ పై కామెంట్ చేశాడు. ఇప్పుడు 2.ఓకి అది రిపీట్ అయ్యింది. ఇదిలాఉంటే మహేష్ అసలు ఎందుకు అరవింద సమేతపై ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అన్నది డిస్కషన్స్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, త్రివిక్రం ఇద్దరు మహేష్ కు తెలిసినవారే. అయినా మహేష్ అరవింద సమేత గురించి రెస్పాండ్ అవలేదు.

మహేష్ చేస్తున్న ఈ పనుల వల్ల ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారట. కోలీవుడ్ ఫ్యాన్స్ సంపాదిచుకునేందుకు కేవలం అక్కడ హీరోల సినిమాలనే ప్రస్థావించడం వల్ల తెలుగు ఆడియెన్స్ కు దూరమయ్యే అవకాశం ఉంది. మరి మహేష్ ఈ విషయాన్ని గమనించి అందరి సినిమాల మీద తన కామెంట్స్ తెలియచేస్తే బెటర్. లేదంటే నందమూరి ఫ్యాన్స్ లానే మరో హీరో ఫ్యాన్స్ కూడా తన మీద ఎటాక్ చేసే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఆ సినిమా వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news