Gossipsరంగస్థలం మరింత ఇంత దారుణంగానా.. నిర్మాతలకు ఎందుకు ఇంత కక్కుర్తి..!

రంగస్థలం మరింత ఇంత దారుణంగానా.. నిర్మాతలకు ఎందుకు ఇంత కక్కుర్తి..!

రాం చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు తన నటనకు మంచి మార్కులు పడ్డ సినిమాగా మైల్ స్టోన్ మూవీ అనిపించుకున్న రంగస్థలం నిర్మాతల తప్పిదం వల్ల దారుణంగా ఎవరు ఊహించని విధంగా సినిమా రిలీజ్ అయిన నెలన్నరకే ఆన్ లైన్ లోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను అమేజాన్ ప్రైం భారీ రేటుకే కొనేశారు.

అయితే సినిమా సూపర్ హిట్ అయినా కూడా రిలీజ్ అయిన 50 రోజుల్లోనే అమేజాన్ పైన్ వారు ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అలానే వచ్చాయి. ఇక ఇప్పుడు రంగస్థలం కూడా మే 15న అమేజాన్ ప్రైం లో దర్శనమిస్తుందట. ఇది కచ్చితంగా నిర్మాతల మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలుస్తుంది.

హిట్ సినిమా కాబట్టి ఇంకాస్త ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే అమేజాన్ ప్రైం వారికి మాత్రం ఇదేమి కుదరదు. తీసుకున్న సినిమా లెక్క చెప్పి మరి ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. రంగస్థలం మే 15న షెడ్యూల్ చేశారట. అమేజాన్ ప్రైం మెంబర్ షిప్ ఉన్న వారు ఈ సినిమా చూసేయొచ్చు. ఇదో రకంగా థియేటర్ లో ఇంకాస్త ఎక్కువ రోజులు ఆడే విధానాన్ని దెబ్బతీస్తున్నా ఇప్పుడు స్టార్ సినిమాలన్ని వారం రెండు వారాల లెక్కే కాబట్టి 50 రోజులకు అమేజాన్ లో వస్తే సమస్యలేమి ఉండవని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news