Movies" అజ్ఞాతవాసి " ప్రీ - రివ్యూ

” అజ్ఞాతవాసి ” ప్రీ – రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10 అనగా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అయితే ఓవర్సీస్ లో ఈరోజు ప్రీమియర్స్ పడే అవకాశం ఉంది.

ట్రైలర్, టీజర్ చూస్తే.. ఓ గొప్పింటి బిడ్డ అయిన హీరో అభిజిత్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ఏదో వెతుక్కుంటూ వెళ్తాడు. రాజకుమారుడే అయినా ప్రవాసిగా తిరుగుతుంటాడు. అయితే అది ఎందుకు అసలు కథ ఏంటి అన్నదే అజ్ఞాతవాసి సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు త్రివిక్రం శ్రీనివాస్ అభిమానులకు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.

అతని రాకకోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.. ట్రైలర్ ఫస్ట్ షాట్ లో చూపించింది అదే.. ఇక ఇది మనం కూర్చునే కుర్చి.. పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి.. అంటూ బొమన్ ఇరానిని చూపించాడు అంటే ఓ గొప్ప వాడని చూపించాడు. రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి అంటూ కుష్బుని చూపించారు.. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకాల ఓ మిని యుద్ధమే ఉంటుంది.. ఇది ట్రైలర్ లో పవన్ చెప్పిన డైలాగ్..

సినిమా కథను చూపించకుండా సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలిసేలా చేశాడు త్రివిక్రం. సినిమాలో విలన్ గా నటించిన ఆది కూడా వయిలెన్స్ అనేది ఆప్షన్ కాదని చెబుతాడు.. అంటే అతను కూడా స్టైలిష్ విలన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

సినిమా ట్రైలర్ టీజర్ అంచనాలను పెంచేయగా.. పవన్ కళ్యాన్ స్టైల్.. త్రివిక్రం డైలాగ్స్, డైరక్షన్ తో పాటుగా కీర్తి సురేష్ అభినయం.. అను ఇమ్మాన్యుయెల్ అందం సినిమాకు ఆకర్షణగా ఉంటాయని తెలుస్తుంది. ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా సినిమాలో మరో క్రేజీ థింగ్ అని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విజయ ఢంఖా మోగిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి సినిమా ఏమాత్రం అంచనాలను అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news