Gossipsసింహానికి బయ్యర్లు చుక్కెదురు.. బాలయ్యకు షాక్ ఇచ్చారు..!

సింహానికి బయ్యర్లు చుక్కెదురు.. బాలయ్యకు షాక్ ఇచ్చారు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి నటిస్తున్నారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కావడంతో నిర్మాత బిజినెస్ రేటు పెంచాడట.
బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అయ్యి వసూళ్లు రాబట్టినా ఆ తర్వాత వచ్చిన పైసా వసూల్ డిస్ట్రిబ్యూటర్లకు లాసులే తెచ్చిపెట్టింది. అందుకే పైసా వసూల్ షాక్ తగిలిన డిస్ట్రిబ్యూటర్స్ జై సిం హా కు లిమిటెడ్ బిజినెస్ అడుగుతున్నారట. నిర్మాత మాత్రం భారీగా కోట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కాంబినేషన్ మీద నమ్మకంతో నిర్మాత డబ్బులు గుమ్మరించగా ఇప్పుడు బయ్యర్లు మాత్రం సినిమాపై అంత పెట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది.
నైజాం, సీడెడ్ ఇంకొన్ని ఏరియాలు తప్ప మిగతా ఏరియాలు బిజినెస్ కాలేదని తెలుస్తుంది. నిర్మాత చెప్పిన రేటుకి బయ్యర్లు బెంబేలవుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి జై సింహా నిర్మాతకు షాక్ తగిలినట్టైంది. ట్రైలర్ బాలయ్య మాస్ మసాలా ట్రీట్ ఇస్తున్నా.. ఎక్కడో తేడా కొడుతుందని అంటున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news