Moviesమళ్ళీ రాకూలే కావాలంటున్న మెగా ఫ్యామిలీ ! 

మళ్ళీ రాకూలే కావాలంటున్న మెగా ఫ్యామిలీ ! 

ధ్రువ , బ్రూస్లీ సినిమాల్లో అలరించిన రాంచరణ్, రకూల్ జోడి మరోసారి కనువిందు చేయనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న  ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ఉదయం కొణిదెల ప్రొడక్షన్‌ ఆఫీస్‌లో జరిగాయి.

మొదటిసారిగా చెర్రీతో బోయపాటి తీయబోతున్న సినిమా కావడంతో దీనిమీద అందరికి భారీ అంచనాలు ఉన్నాయి.  ‘సరైనోడు’ తరహాలోనే ఇదీ కూడా మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్నట్టు  సమాచారం. ప్రస్తుతం స్టోరీ పనులు పూర్తి కావడంతో నటీనటులు ఎంపికలో యూనిట్ సభ్యులు నిమగ్నమయ్యి ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కాకుండా కొత్తవాళ్లతో ప్రయోగం చేయాలని భావిస్తున్నాడట బోయపాటి. ఇలా చెయ్యడం వలన తక్కువ బడ్జెట్‌లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అంటున్నాడట. కానీ, రకుల్ అయితే బాగుంటుందని మెగా ఫ్యామిలీ సూచిస్తోందంట !  ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ‘రంగస్థలం’ 2018 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news